డీజేపై డెలీవరి లైంగిక వేధింపులు, బాధితురాలు ఏం చేసిందంటే?
బెంగుళూరు: పుడ్ డెలివరీ చేసే బాయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పబ్లో పనిచేసే మహిళా డీజే తన ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు కూడ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.
బెంగుళూరులోని ఓ పబ్లో పనిచేసే ఓ మహిళా డీజే ఒంట్లో బాగా లేకకోపవడంతో ఆన్లైన్లో ఇంటికే భోజనాన్ని ఆర్డర్ చేసింది. అయితే భోజనం తీసుకువచ్చిన డెలీవరి బోయ్ నేరుగా ఇంట్లోకే వచ్చాడు.
డెలీవరి బోయ్ కనీసం తన ఫ్లాట్ తలుపులు తట్టకుండానే వచ్చాడని బాధితురాలు ఆరోపించారు. అంతేకాదు ఈ విషయమై తాను అతడిని నిలదీసినట్టు చెప్పారు. మరో వైపు భోజనం తీసుకొని బిల్లు చెల్లించి తాను ఇంట్లోకి వెళ్తుంటే డెలీవరి బోయ్ తనను అనుసరించాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.
అంతేకాదు తన పట్ల ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను అతడితో వాగ్వాదానికి దిగినట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో పక్క ప్లాట్లో ఉన్న కుక్కలు మొరగడంతో డెలీవరి బోయ్ పారిపోయాడని ఫేస్ బుక్ ద్వారా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.