ట్విస్ట్, పన్నీరుకు ఝలక్: స్టాలిన్తో టచ్లో 15 మంది ఎమ్మెల్యేలు?
తమిళనాడు రాజకీయాలు నిమిషానికి ఓ మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో.. మరో ఆసక్తికర అంశం కూడా వెలుగు చూస్తోంది.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు నిమిషానికి ఓ మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో.. మరో ఆసక్తికర అంశం కూడా వెలుగు చూస్తోంది.
శశికళ 'సీఎం' కాకుండా ఆపండి: హడావుడి ఎందుకని సుప్రీం కోర్టు, చిన్నమ్మకు ఊరట
అన్నాడీఎంకే పార్టీకి చెందిన దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్ స్టాలిన్తో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీరు సెల్వం - శశికళ వర్గీయుల మధ్య హోరాహోరీ నడుస్తోంది.
తమిళనాడు ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి తాము అంశాల వారిగా మద్దతు పలుకుతామని స్టాలిన్ ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తాము పన్నీరు సెల్వంకు మద్దతిస్తామని ప్రకటించలేదని ఆయన తాజాగా చెప్పారు. త్వరలో సరైన నిర్ణయం వెలువడుతుందన్నారు.
మరోవైపు, శశికళ వర్గం నుంచి పలువురు ఎమ్మెల్యేలు పన్నీరు వైపు వస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టాలిన్తో అధికార పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే ప్రచారం మరింత కలకలం రేపుతోంది.