డిఎంకె కీలకసమావేశం:అధికారం కోసం పావులు, స్టాలిన్ ఇలా...
తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిఎంకె ఉన్నత స్థాయి సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో బలపరీక్ష సమయంలోనూ, భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించనున
చెన్నై:అన్నాడిఎంకె పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకుగాను డిఎంకె అత్యున్నతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించనుంది.
త్వరలోనే డిఎంకె పాలన తమిళనాడులో రానుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశాడు. ఈ మేరకు ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
అన్నాడిఎంకె పార్టీలో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. పార్టీ శశికళ, పన్నీర్ సెల్వం గ్రూపులుగా విడిపోయింది.శశికళ వర్గం నుండి పన్నీర్ సెల్వం గ్రూప్ లోకి పార్టీ ప్రజా ప్రతినిధుల వలసలు పెరుగుతున్నాయి.
పన్నీర్ సెల్వానికి తమ మద్దతు ఉంటుందని డిఎంకె ప్రకటించింది. ఈ తరుణంలో శశికళ వర్గం కూడ పన్నీర్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్ ను లక్ష్యంగా చేసుకొని ఆమె పావులు కదుపుతోంది.
రోజు రోజుకు అన్నాడిఎంకెలో పరిణామాలు మారుతున్నాయి. ఒక్కడుగానే ఉన్న పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతున్న పరిస్థితి కన్పిస్తోంది.శశికళ గ్రూప్ లో ఉన్ననాయకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.