చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసుపత్రిలో డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కురుణానిధి: కావేరి ఆసుపత్రి క్లారిటీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం. కరుణానిధి బుధవారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ చికిత్స కోసం కరుణానిధి చెన్నైలోని అళ్వార్ పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. కొంత కాలంగా ట్రాకియోటమీతో కరుణానిధి బాధపడుతున్నారు.

DMK president Karunanidhi hospitalised in Chennai

ట్రాకియోటమీ (శ్వాస నాళాలు) చికిత్స కోసం బుధవారం కరుణానిధిని కావేరి ఆసుపత్రికి తరలించారని తెలిసింది. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కరుణానిధి ఇంటికే పరిమితం అయ్యారు. ఈ చికిత్సలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్రాకియోటమీ ట్యూబ్ మార్చ వలసి ఉంటుంది.

బుధవారం కరుణానిధి ట్రాకియోటమీ చికిత్స కోసమే ఆసుపత్రిలో చేరారని డీఎంకే వర్గాలు అంటున్నాయి. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ చికిత్సలో భాగంగా ఆయన ఆసుపత్రికి వచ్చారని, ఆయన అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని కావేరీ ఆసుపత్రి వర్గాలు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎంకే పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కావేరి ఆసుపత్రి ముందు గుమికూడటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులు కావేరి ఆసుపత్రిలోనే ఉన్నారు.

English summary
DMK president Kalaignar M Karunanidhi was on Wednesday admitted to Kauvery hospital in Chennai for change of tracheostomy tube.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X