వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: తమిళనాడులో డిఎంకె పాలన, పన్నీర్ కు అందుకేనా?

డిఎంకె పాలన త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో రానుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు.ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశాడు.అన్నాడిఎంకె లోని రెండు వర్గాలు పోటీలు పడి పాలనను

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె అధికారంలోకి రాబోతోందని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్అభిప్రాయపడ్డారు.అన్నాడిఎంకె పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.

డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశాడు. ఈ లేఖలో త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలోనే డిఎంకె పాలన రాబోతోందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పరిపాలన స్థంబించిందని, అధికారం కోసం పార్టీ నాయకులు కుమ్ములాడుకొంటున్నారని ఆయన విమర్శించారు.

stalin

సామాన్యులకు భద్రత కరువైందన్నారు. నేరాలు అధికమయ్యాయని ఆయన చెప్పారు.అరియలూరులో నందిని అనే బాలికపై అత్యాచారం జరిపి హత్య చేయడం సభ్యసమాజం తలదించుకొనేలా ఉందన్నారు.

అధికారపక్షంలో రెండు వర్గాలలో ఎవరి మాట వినాలో తెలియక పోలీసులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఈ పరిస్థితుల్లో డిఎంకె మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు.

ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వానికి డిఎంకె మద్దతివ్వాలని నిర్ణయించుకోవడం వెనుక ఉద్దేశ్యం కూడ ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.శశికళకు చెక్ పెట్టడంతో పాటు పన్నీర్ సెల్వాన్ని రాజకీయంగా సులభంగా ఎదుర్కోవచ్చనే అభిప్రాయాన్ని డిఎంకె నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
DMK Ruling will be soon In Tamilnadu said DMK working president stalin.he wrote a letter for party workers.people wants to DMK rule in Tamilnadu he said in that letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X