చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా కాటుకు మరో టాప్ లీడర్ బలి, ఎమ్మెల్యేకి పాజిటివ్, ఫ్యామిలీ మొత్తం, ప్రజాసేవలో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో రికార్డు బ్రేక్ చేస్తూ తమిళ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు తమిళనాడులో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు మరణిస్తున్నారు. ఇప్పటికే డీఎంకే పార్టీ సీనిమర్ ఎమ్మెల్యే కరోనా వైరస్ కాటుకు మరణించాడు. ఇప్పుడు అదే డీఎంకే పార్టీకి చెందిన మరో టాప్ లీడర్ మరణించారు. డీఎంకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీని క్వారంటైన్ కు తరలించారు. ఈ దెబ్బతో డీఎంకే పార్టీ నేతలతో పాటు సామన్య ప్రజలు హడలిపోతున్నారు. ఆదివారం వరకు తమిళనాడులో 59, 337 కరోనా కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు.

విశ్వ సుందరి: అబ్బా... నువ్వేకావాలి, ఓరీ మూర్ఖుడా.... పిల్లల తల్లి వద్దురా, జైల్లో చెక్క భజన!విశ్వ సుందరి: అబ్బా... నువ్వేకావాలి, ఓరీ మూర్ఖుడా.... పిల్లల తల్లి వద్దురా, జైల్లో చెక్క భజన!

 తమిళనాడు పేరు వింటే దడదడ

తమిళనాడు పేరు వింటే దడదడ

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదు అయ్యింది మహారాష్ట్రలోనే అనే విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి వరుసలో ఉంది. తమిళనాడులో ఆదివారం రాత్రి వరకు 59, 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒక్క ఆదివారం (జూన్ 21) మాత్రమే తమిళనాడులో 2, 582 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ఇప్పటి వరకు 757 మంది మరణించారు.

 చెన్నై కోయంబేడు దెబ్బ

చెన్నై కోయంబేడు దెబ్బ

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో కరోనా వైరస్ దెబ్బకు మళ్లీ అక్కడ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. జూన్ 21వ తేదీ ఆదివారం చెన్నై సిటీలో జనతా కర్ఫూ విధించారు. అయినా ఒక్క చెన్నై సిటీలో ఆదివారం ఏకంగా 1, 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నైలో ఇప్పటి వరకు మొత్తం 41, 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నైలో కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 53 మంది మరణించారు.

చెన్నై టాప్ లీడర్ కరోనాకు బలి

చెన్నై టాప్ లీడర్ కరోనాకు బలి

ఉత్తర చెన్నై జిల్లా డీఎంకే పార్టీ కార్యదర్శిగా గత 25 ఏళ్లుగా పని చేస్తున్న ఆ పార్టీ టాప్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన బలరామన్ (77) కు కరోనా వైరస్ వ్యాధి సోకింది. కరోనా వైరస్ వ్యాధితో చికిత్స పొందుతున్న బలరామన్ చికిత్స విఫలమై మరణించడంతో డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురైనారు.

ఒకే సారి కరోనా, టైఫాయిడ్ జ్వరం

ఒకే సారి కరోనా, టైఫాయిడ్ జ్వరం

ఐదు రోజుల క్రితం చెన్నై అన్నానగర్ లోని శాంతి కాలనీలో నివాసం ఉంటున్న బలరామన్ ను ఆసుపత్రికి తరలించడం, కారోనా వైరస్ సోకిందని వెలుగు చూడటం, అదే సమయంలో ఆయనకు టైఫాయిడ్ జ్వరం రావడంతో చికిత్స విఫలమై మరణించారని వైద్యులు చెప్పారు. డీఎంకే పార్టీ తనిఖి విభాగం సీనియర్ నాయకుడు అయిన బలరామన్ మరణించడం పార్టీకి తీరనిలోటు అని ఆ పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ అన్నారు. బలరామన్ కుటుంబ సభ్యులకు ఎంకే. స్టాలిన్ సానుభూతి తెలిపారు. డీఎంకే పార్టీ సీనియర్ నేత బలరామన్ కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

తమిళనాడులో కరోనా వైరస్, లాక్ డౌన్ సేవల్లో పాల్గోనాలని డీఎంకే పార్టీ నేత ఎంకే. స్టాలిన్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సేవలో ఉన్న నాయకులు ఇప్పుడు కరోనా వైరస్ బారినపడటంతో ఆ పార్టీ నేతలు హడలిపోతున్నారు. ఇప్పటికే డీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అన్భళగన్ కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. ఇప్పుడు తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలోని రిశివంధియమ్ నియోజక వర్గం డీఎంకే పార్టీ ఎమ్మెల్యే వసంతమ్ కార్తికేయన్ తో పాటు ఆయన తల్లికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 క్వారంటైన్ లో ఎమ్మెల్యే ఫ్యామిలీ

క్వారంటైన్ లో ఎమ్మెల్యే ఫ్యామిలీ

కళ్లకురిచ్చి జిల్లా రిశివంధియమ్ నియోజక వర్గం డీఎంకే పార్టీ ఎమ్మెల్యే వసంతమ్ కార్తికేయన్, ఆయన తల్లికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన కుటుంబ సభ్యులు అందరికీ వైద్య పరీక్షలు చేశారు. డీఎంకే పార్టీ ఎమ్మెల్యే వసంతమ్ కార్తికేయన్ భార్య, వారి పిల్లలకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు వారిని క్వారంటైన్ కు తరలించారు. ప్రజా సేవలో ఉంటున్న ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు కరోనా పాజిటివ్ వస్తోందని వెలుగు చూసిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయ నాయకులు హడలిపోతున్నారు.

English summary
Coronavirus: DMK senior leader and Former North Chennai Dis Secretary L Balarama passed away. Vasantham K Karthikeyan, the DMK MLA from Rishivandhiyam, tested positive for COVID 19 on Sunday. He is the second legislator from the DMK and third in the state to contract the infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X