చికిత్స పేరుతో మత్తిచ్చి మైనర్పై డాక్టర్ రేప్,
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఓ డాక్టర్ దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా చికిత్స కోసం వచ్చిన బాలికపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటు చేసుకొంది. చికిత్స కోసం వెళ్ళిన బాలిక రెండు రోజులుగా ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత ఆమె ఇంటికి చేరుకొంది.
మత్తులో ఉన్న పరిస్థితిలోనే బాలిక ఇంటికి చేరుకొంది. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికకు మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు ప్రకటించారు.
చికిత్స కోసం ఒంటరిగా వచ్చిన బాలికకు మత్తు మందిచ్చి వైద్యుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలికకు చికిత్స పేరుతో అత్యాచారానికి పాల్పడిన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైద్యుడి క్లినిక్లో కొన్ని అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్లో అత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్నాయి. బాధితురాలు ఆందోళన చేసిన విషయం ఇంకా మర్చిపోకముందే ఈ ఘటన వెలుగు చూసింది.