దారుణం: ముస్లిం గర్భిణీని చేర్చుకోని ఆస్పత్రి వైద్యులు, అంబులెన్స్లోనే డెలివరీ, శిశువు మృతి
జైపూర్: రాజస్థాన్ భరత్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ అయిన ఒక ముస్లిం మహిళను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆమెను మరో ఆస్పత్రిలో అంబులెన్స్లో తరలిస్తుండగా.. ఆమె పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆ నవజాత శిశవు ప్రాణాలు కోల్పోయింది.
'నా భార్యను డెలివరి కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాను. సిక్రి నుంచి జిల్లా కేంద్రంలోని జనన ఆస్పత్రికి రెఫర్ చేయడం జరిగింది. అయితే, మేము ముస్లిం కాబట్టి జైపూర్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు ఇక్కడ ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో అంబులెన్స్ లో ఆమెను తీసుకెళుతుండగా.. పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆ పాప చనిపోయింది. నా పాప మరణానికి ఆస్పత్రి వైద్యులే బాధ్యత వహించాలి' అని బాధితురాలి భర్త అన్నారు.
ఆ గర్భిణీ మహిళ చాలా క్లిష్ట పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చింది.. అందుకే ఆమెను జైపూర్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే, విషాదం జరిగిపోయింది. ఘటనపై విచారణ చేపడతామని భరత్పూర్ జనన ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ రూపేంద్ర ఝా తెలిపారు.
The staff must be tried as common criminals & should receive exemplary punishment @ashokgehlot51. They are responsible for putting at risk an innocents' life. Should we now stop seeking healthcare? Anti-Muslim hate reaches new heights everyday & is costing us our lives [1/2] https://t.co/hKh1RB47z7
— Asaduddin Owaisi (@asadowaisi) April 4, 2020
రాజస్థాన్ పర్యాటక మంత్రి విశ్వేంద్ర సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అని ఆస్పత్రిలో చేర్చుకోరా అంటూ మండిపడ్డారు. భరత్పూర్ ఎమ్మెల్యేనే ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఆయన ఇలాకాలోనే ఇలా జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలా సిగ్గుపడే ఘటన అని విశ్వేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
Pregnant Muslim Woman was refused medical attention at the Zenana Hospital in #Bharatpur & was told to go to Jaipur given her religion. Local Bharatpur MLA is State Health Minister & this is the condition of the hospital in Bharatpur City. Shameful. pic.twitter.com/Rd2i4UZGk3
— Vishvendra Singh Bharatpur (@vishvendrabtp) April 4, 2020
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ముస్లిం అని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం దారుణమని, బాధ్యులైన డాక్టర్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా వీడియో జత చేసి ట్వీట్ చేశారు.