మాజీ సీఎం రబ్రీ దేవి అనూహ్య నిర్ణయం: ఈ ఏడాది చాత్ పండుగలో పాల్గొనను
పాట్నా :బీహారీలు అత్యంత ఇష్టంగా ఘనంగా జరుపుకొనే పండుగ చాత్. ఈ పండుగలో తాను ఈ ఏడాది పాల్గొనబోనని మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి ప్రకటించారు.ప్రతి ఏటా చాత్ పండుగను రబ్రీ దేవి ఘనంగా నిర్వహిస్తారు.ఈ పండుగలో పాల్గొనబోమని సోమవారం నాడు ఆమె ప్రకటించారు.
వచ్చే వారంలో బీహార్ లో చాత్ పండుగ నిర్వహించుకొనున్నారు బీహర్ ప్రజలు. లాలూ ఇంట్లో జరిగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి రాజకీయప్రముఖులను కూడ ఆహ్వానించేవారు.అలాంటి ముఖ్యమైన వేడుకకు దూరంగా ఉండడానికి కూడ ముఖ్యమైన కారణం ఉందని చెబుతున్నారు రబ్రీ కుటుంబసభ్యులు.
తన కుమారుల వివాహాలు జరిగిన తర్వాతే వచ్చే ఏడాది చాత్ పండుగలో పాల్గొంటానని ఆమె చెబుతున్నారు.రబ్రీదేవి పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల వివాహాలను వేసవికాలం నాటికి పూర్తి చేయాలని బావిస్తున్నారు.వీరిద్దరి వివాహాలు జరిగిన తర్వాతే చాత్ పూజలో పాల్గొనాలని ఆమె భావిస్తున్నారు.
తేజస్వీ యాదవ్ బీహార్ డిప్యూటీ సిఎంగా ఉన్నారు.తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బీహార్ లో రాజకీయాల్లో ఇద్దరు సోదరులు చురుకుగ్గా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో వీరిద్దరూ కూడ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వీరిద్దరికి వివాహం చేసిన తర్వాత చాత్ పండుగలో పాల్గొనాలని రబ్రీదేవి తలపెట్టారు.