ఆర్టిస్ట్ హేమ, లాయర్ హత్య: 'భర్తే చంపి ఉంటాడు'
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హత్యలో.. హేమ భర్త చింతన్ వైపు ఆమె కుటుంబ సభ్యులు వేలు చూపిస్తున్నారు. పోలీసులు కూడా భర్త చింతన్ ఉపాధ్యాయ కోణంలోను విచారణ జరుపుతున్నారు.
తాజాగా, హేమా ఉపాధ్యాయ కజిన్ బ్రదర్ దీపక్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ హత్యలో చింతన్ ఉపాధ్యాయ పాత్ర ఉందని తాను, తన కుటుంబ సభ్యులు బలంగా అనుమానిస్తున్నామని చెప్పారు.
ప్రధాన నిందితుడు విద్యాధర్ రాజ్ భర్, మరికొందరు రూ.5 లక్షల కోసం చంపారనే విషయానని తాము నమ్మడం లేదన్నారు. ఆమె విద్యాధర్కు గతంలో ఆర్థికంగా సహకరించిందన్నారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని కూడా ఎప్పుడూ హేమ విద్యాధర్ను అడగలేదన్నారు.
కొన్నేళ్ల క్రితం చింతన్.. హేమను బెదిరించారని చెప్పారు. మరోవైపు, కేసును విచారిస్తున్న పోలీసులు మాట్లాడుతూ... మృతదేహం లభ్యం కాగానే దానిని గుర్తించి, కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నామని చెప్పారు. చింతన్ పైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెప్పారు.