బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug case: గోవాలో ప్రత్యక్షం అయిన దీపికా పదుకొనే, ఎన్ సీబీ విచారణ తరువాత, మళ్లీ పిలుస్తారా?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ గోవా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంతో అనేక మంది నటీనటుల తలరాతలుమారిపోయాయి. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు. ఎన్ సీబీ అధికారుల విచారణకు హాజరైన తరువాత తనకు ఈ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని దీపికా పదుకొనే మీడియాకు చెప్పింది. ఇంతకాలం ముంబాయిలోని ఇంటికే పరిమితం అయిన దీపికా పదుకొనే ఇప్పుడు గోవాలో ప్రత్యక్షం అయ్యింది.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

దీపికా మీకు వాళ్లతో లింక్ ఉందా ? లేదా ?

దీపికా మీకు వాళ్లతో లింక్ ఉందా ? లేదా ?

బాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి జైలుపాలైయ్యింది. బుధవారం రియా చక్రవర్తికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. రియా చక్రవర్తి అరెస్టు తరువాత అనేక మంది బాలీవుడ్ స్టార్స్ ను NCB అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ‘పద్మావతి' దీపికా పదుకొనేని ముంబాయిలోని ఎన్ సీబీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు ఆమెను విచారణ చేశారు. డ్రగ్స్ సేవించే వాళ్లతో మీకు ఏమైనా లింక్ ఉందా ? లేదా ? అంటూ ఎన్ సీబీ అధికారులు దీపికా పదుకొనేని ప్రశ్నించారని వెలుగు చూసింది.

సార్.... నాకేం తెలీదు.... అంతే !

సార్.... నాకేం తెలీదు.... అంతే !

ముంబాయిలోని ఎన్ సీబీ కార్యాలయంలో అధికారులు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేని సుమారు 5 గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఎన్ సీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ దీపికా పదుకొనే ఆమె దగ్గర ఉన్న సమాధానం చెప్పిందని తెలిసింది. NCB అధికారుల విచారణ పూర్తి అయిన తరువాత మీడియాతో మాట్లాడిన దీపికా పదుకొనే డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు... అంతే అంటూ సమాధానం ఇచ్చారు.

ముంబాయిలోని ఇంటికే మేడమ్ పరిమితం

ముంబాయిలోని ఇంటికే మేడమ్ పరిమితం

ఎన్ సీబీ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన దీపికా పదుకొనే నేరుగా ముంబాయిలోని ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి దీపికా పదుకొనే ముంబాయిలోని ఇంటికే పరిమితం అయ్యింది. ఇదే డ్రగ్స్ కేసులో సారా ఆలీ ఖాన్, శ్రద్ద కపూర్ తదితరులను ఎన్ సీబీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

గోవాలో దీపికా ప్రత్యక్షం

గోవాలో దీపికా ప్రత్యక్షం

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ సీబీ అధికారుల విచారణ తరువాత దీపికా పదుకొనే గోవాలో ప్రత్యక్షం అయ్యింది. ఇంతకాలం ముంబాయిలో ఉండిపోవడంతో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి దీపికా పదుకొనే గోవా చేరుకున్నారు. ఇంతకు ముందు గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు విచారణకు హాజరుకావాలని దీపికా పదుకొనేకి నోటీసులు ఇచ్చారు.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
మళ్లీ పిలుస్తారా ?

మళ్లీ పిలుస్తారా ?

గోవాలో జరుగుతున్న షూటింగ్ మధ్యలోనే దీపికా పదుకొనే ముంబాయి వెళ్లిపోయింది. ఎన్ సీబీ అధికారుల విచారణ తరువాత దీపికా పదుకొనే షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే ఎన్ సీబీ అధికారులు మరోసారి దీపికా పదుకొనేని విచారణకు పిలుస్తారా ? లేదా ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు.

English summary
Drug case: After NCB interrogation Bollywood Actress Deepika Padukone return to Goa to Resume Shooting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X