మద్యం మత్తులో విమానంలోనే మూత్ర విసర్జన
లండన్: మద్యం మత్తులో విమానంలో మూత్ర విసర్జన చేసిన ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుల ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి గాను ఆ ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా 1000 పౌండ్ల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.... జనవరి 19న జిను అబ్రహం (39) అనే వ్యక్తి తన 10 ఏళ్ల కుమారుడితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు.
మద్యం మత్తులో ఉన్న అతను తాను కూర్చున్న సీటు బెల్టు తొలగించి, తోటి ప్రయాణికులు, సిబ్బంది వారిస్తున్నా వినకుండా విమానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో తోటి ప్రయాణికులు అతడిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తనతో ఆగ్రహం చెందిన ఎయిరిండియా సిబ్బంది బర్మింగ్హామ్ చేరుకోగానే అతడిని అదుపులోకి తీసుకుంది.
అనంతరం అతడిని బర్మింగ్హామ్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం బర్మింగ్హామ్ క్రౌన్ కోర్టు అతడికి 1000 పౌండ్లను జరిమానాగా విధించింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సిబ్బందిని స్పందించగా మాట్లాడేందుకు నిరాకరించారు.