వీడు తండ్రేనా?: కొడుకును అమ్మేసి.. సెల్ ఫోన్ కొన్నాడు, ఆపైన తాగి తందనాలాడాడు!
ఒడిశాలోని భద్రక్లో ఓ తండ్రి చేసిన నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. కన్న కొడుకును అమ్మేసిన ఆ తండ్రి.. వచ్చిన డబ్బుతో సెల్ఫోన్ కొనుక్కుని, మిగిలిన డబ్బుతో మద్యం తాగి తందనాలాడాడు.
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్లో ఓ తండ్రి చేసిన నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. కన్న కొడుకును అమ్మేసిన ఆ తండ్రి.. వచ్చిన డబ్బుతో సెల్ఫోన్ కొనుక్కుని, మిగిలిన డబ్బుతో మద్యం తాగి తందనాలాడాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. స్వీపర్గా పనిచేస్తున్న బలరాంముఖి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నాడు. ఇటీవల బలరాంను కలిసిన ఓ అంగన్వాడీ కార్యకర్త ఓ వృద్ధ దంపతులు ఓ బాలుడిని దత్తత తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పాడు.
దీంతో బలరాం వారితో బేరమాడి తన 11 నెలల కుమారుడిని రూ.25 వేలకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుల్లోంచి రూ.2 వేలు పెట్టి సెల్ఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో తాగి తందనాలాడి, తన పాపకు రూ.1500తో వెండి కడియాలు చేయించాడు. బలరాంకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 60 ఏళ్ల సోమనాథ్ సేథి అనే వ్యక్తి ప్రభుత్వ సంస్థలో డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యాడని, తమ కుమారుడు 2012లో మృతిచెందడంతో అతడి భార్య డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. ఆమెను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు బాలుడిని దత్తత తీసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.