షాకింగ్: మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన శవంగా మారిన తన భార్యతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఆమెను మద్యం మత్తులో అతనే కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమె శవంతోనే విపరీతచర్యకు ఒడిగట్టాడు.
గత నెల 30వ తేదీన పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్లో ఈ సంఘటన జరిగింది. నిందితుడి పేరు ప్రదీప్. అతనిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అతను ఈ రిక్షా డ్రైవర్.
ప్రదీప్ మద్యం మత్తులో తన భార్య మోనికతో గొడవ పడ్డాడు. డబ్బు విషయమై ఇరువురి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రదీప్ అనుమానించేవాడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన రాత్రి ఇంటి అద్దె చెల్లించకపోవడంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
అప్పుడు ప్రదీప్ పూటుగా మద్యం తాగి ఉన్నాడు. ఆవేశంతో ఇటుకతో భార్యను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఉదయం జరిగిన విషయం గుర్తించిన ప్రదీప్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి పారిపోయాడు. అతనిని యూపిలోని సంగ్లోయి రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారు.