పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్, దేవుళ్ళకు తప్పని కష్టాలు, ఈ వ్యాలెట్ కష్టాలు తీరేనా
పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం దేవాలయాలపై కూడ పడింది. దేవాలయాలకు విరాళాలు గణనీయంగా పడిపోయింది. అయితే దేవాలయా్లో ఈ వ్యాలెట్ ను గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది.
గుజరాత్ : పెద్ద గనదు నోట్ట రద్దు ప్రభావం దేవాలయాలకు కూడ తప్పలేదు. రద్దుచేసిన నగదును హుండీల్లో వేస్తోన్న, దేవాలయాలకు విరాళాలు ఇచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వ్యాలెట్ సౌకర్యంతో దేవాలయాలకు విరాళాలు సేకరించేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్దమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన సతీమణి బ్యాంకు కాతా నుండి ఆయన 31 వేల రూపాయాలను విరాళంగా అందించారు.
పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో దేవాలయాలకు విరాళాలు ఇచ్చేవారికి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈ వ్యాలెట్ పద్దతిని గుజరాత్ లో ప్రవేశపెట్టింది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు.
భక్తులు దేవాలయాలకు విరాళం ఇచ్చేందుకు స్వైపింగ్ మిషన్లను కూడ ఆయా దేవాలయాల్లో ఏర్పాటు చేశారు. నగదు రహిత విరాళాలను తీసుకొనేందుకే పెద్ద ఎత్తున ప్రయత్నాలను చేసింది గుజరాత్ ప్రభుత్వం.డిజిటల్ డొనేషన్ సిస్టమ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం నాడు ప్రారంభించారు.
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆయా దేవాలయాలకు భక్తులు విరాళాలను సమర్పించే అవకాశం ఉంది.పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేవాలయాలకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.