వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం: పోర్ట్బ్లెయిర్కు 250 కి.మీల దూరంలో కేంద్రం
న్యూఢిల్లీ: అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. అయితే, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 10.31 గంటలకు ఈ భూకంపం సంభవించింది. తూర్పు పోర్ట్ బ్లెయిర్కు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంప డెప్త్ 10 కిలోమీటర్లు ఉందని అధికారులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా దేశంలోని పలు రాస్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఓ వైపు కరోనా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంటే.. మరోవైపు ఈ భూకంపాలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Comments
English summary
An earthquake of 4.8 magnitude hit the Andaman and Nicobar Islands on Friday morning, officials said. There were no immediate reports of any loss of life or damage to property, they said.
Story first published: Friday, July 17, 2020, 20:33 [IST]