వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హర్యానాలో భూకంపం: ఢిల్లీలో ప్రకంపనలు
హర్యానాలోని రోహతక్ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అది రెక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. అయితే, ప్రాణ నష్టం జరిగిన సమాచారమేదీ లేదు.
న్యూఢిల్లీ: హర్యానాలోని రోహతక్ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అది రెక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. అయితే, ప్రాణ నష్టం జరిగిన సమాచారమేదీ లేదు. దాని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉత్తర భారతదేశంలోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఒక్క నిమిషం వరకు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. శుక్రవారం తెల్లవారు జామున 4.20 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాణ, ఆస్తి నష్టాలు రిగిన సూచనలు లేవని అంటున్నారు.
మే 28వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని భదేర్వాహ్, దోడా ప్రాంతాల్లో తేలికపాటి భూకంపం చోటు చేసుకుంది. ఆ సమయంలో కూడా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉత్తర భారత దేశంలోనూ భూప్రకంపనలు సంభవించాయి.
మొదటి భూకంపం సాయంత్రం 7.23 గంటలకు భదేర్వాహ్ ప్రాంతంలో చోటు చేసుకోగా, రెండో ప్రకంపనలు 7.48 గంటలకు చోటు చేసుకున్నాయి.
Comments
English summary
A 5.0 magnitude earthquake has hit Haryana's Rohtak. No casualties have been reported. Earthquake tremors were felt in New Delhi and parts of North India in the wee hours of Friday.
Story first published: Friday, June 2, 2017, 6:27 [IST]