వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాల్ఘర్‌లో భూకంపం: భయంతో జనం బయటకు పరుగులు, లడఖ్‌లోనూ..

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంగళవారం రాత్రి 9.33 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్ సీఎస్) వెల్లడించింది.

అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగినట్లు సమాచారం లేదు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. అధికారులు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు.

 Earthquake hits Maharashtra, tremors felt in Palghar

లడఖ్‌లోనూ భూకంపం

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది. మంగళవారం ఉదయం 5.13 గంటలకు భూకంపం సంభవించగా, దీని భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. కాగా, గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో తరచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం.

English summary
An earthquake of magnitude 3.5 on the Ritcher scale occurred today at 9.33 pm in Palghar, Maharashtra, the National Centre for Seismology (NCS) has informed. So far, no reports of any damage have surfaced, however, all the concerned authorities are monitoring the situation. More to follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X