వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిక్కింలో భూకంపం: పరుగులు తీసిన జనం
సోమవారం తెల్లవారుజామున సుమారు 3.12గంటల సమయంలో సిక్కిం రాష్ట్రంలో భూ కంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప ప్రభావం తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది.
గ్యాంగ్టక్: సోమవారం తెల్లవారుజామున సుమారు 3.12గంటల సమయంలో సిక్కిం రాష్ట్రంలో భూ కంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప ప్రభావం తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది.
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో నివాసాల్లోని ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
కాగా, ఈశాన్య రాష్ట్రాలతోపాటు మయన్మార్ దేశంలో ఆదివారం రిక్టారు స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాతి రోజే మరోసారి భూమి కంపిచడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Comments
English summary
An earthquake of magnitude 4.5 has hit the Sikkim region. The earthquake occurred at 3.12 am on Monday at the East Sikkim region. The earthquake was reported 11 kilometres away from Gangtok.
Story first published: Monday, March 27, 2017, 8:10 [IST]