వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. భూకంపం ప్రకంపనలకు ఢిల్లీ ప్రజలు ఒక్క సారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత 1.40 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం వచ్చింది.

 Earthquake Measuring 3.0 Hits Delhi on Friday Late Night

రిక్టారు స్కేల్ పై 3.0 తీవ్రత నమోదు అయ్యిందని సంబంధిత శాఖ సీనియర్ అధికారి టీ.ఆర్. వైద్య చెప్పారు. కొన్ని సెకన్ల పాటు దీని ప్రకంపనలు ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, ప్రజలు ఆందోళనతో హడలిపోయారని అధికారులు అన్నారు.

భూకంప కేంద్రం సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నట్లు తెలిసిందని అధికారులు చెప్పారు. అయితే ఈ భూకంపం వలన ఎవ్వరికి ఎలాంటి హాని జరగలేదని, ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు అన్నారు. అర్దరాత్రి భూకంపం రావడంతో ఢిల్లీ ప్రజలు శనివారం ఉదయం వరకు జాగరణ చేశారు.

English summary
The tremors were felt around 1:40 am for a few seconds and the epicenter was east Delhi, said Senior Scientist of Seismology Department at IMD, TR Vaidya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X