వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భూకంపం: 43గా తీవ్రత నమోదు
దిగ్లీపూర్: అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారుస్కేలుపై 4.3 గా నమోదైంది. ది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం దిగ్లీపూర్ 55 కిలోమీటర్ల దూరంలో సంభవించింది.
10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. రాత్రి 7.05 గంటల సమయంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. భూకంపం సంభవించడంతో జనం తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Comments
English summary
An earthquake of magnitude 4.3 on the Richter Scale jolted the Andaman and Nicobar Islands on Sunday, the National Center for Seismology (NCS) informed.
Story first published: Sunday, December 6, 2020, 21:24 [IST]