వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ, యూపీల్లో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం వేకువజామున 6 గంటల 28 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. యూపీలోని మీరట్‌ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల ఖర్కౌదాలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు.

కాగా యూపీలోని భూకంప ప్రభావం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Earthquake tremors felt in Delhi and UP

గడిచిన 24 గంటల్లో ఇలా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం రెండోసారి కావడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్‌ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

English summary
Earthquake tremors were felt in parts of Delhi after an earthquake hit 6km from Meerut's Kharkhauda in Uttar Pradesh at 6.28 am on Monday (Sep 10).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X