ఢిల్లీ, యూపీల్లో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో సోమవారం వేకువజామున 6 గంటల 28 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. యూపీలోని మీరట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల ఖర్కౌదాలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు.
కాగా యూపీలోని భూకంప ప్రభావం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
#FLASH Tremors felt in Delhi after earthquake occurred 6 km from Meerut's Kharkhauda in Uttar Pradesh, at 6.28 am
— ANI (@ANI) September 10, 2018
గడిచిన 24 గంటల్లో ఇలా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం రెండోసారి కావడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.