ఈవిఎంల తారుమారు అసాధ్యం: ఈసి స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవిఎంలను) తారుమారు చేయడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ (ఈసి) స్పష్టం చేసింది. ఈవిఎంల్లో ఓటింగును తారుమారు చేసే అవకాశం ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసి ఆ స్పష్టీకరణణ ఇచ్చింది.
పాటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జోతి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ గురి అయ్యే అవకాశమే లేదని ఆయన అంటున్నారు.
గతంలో ఎన్నికల సంఘం మీడియా సమక్షంలోనే వీటిపై ప్రయోగపూర్వకంగా వివరణ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో వీవీపీఏటీ లను వినియోగించిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ట్యాంపరింగ్కు అవకాశమే లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదు అని ఆయన చెప్పారు.
ఏటీఎంలు హ్యాకింగ్కు గురైనప్పుడు.. ఈవీఎంలు కూడా హ్యాకింగ్కు గురి అయి తీరతాయని హర్దిక్ సోమవారం ఉదయం కూడా తాజాగా వ్యాఖ్యలు చేశాడు. అయితే గుజరాత్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వాయిన్ కూడా వాటిని తీవ్రంగా ఖండించారు.