మోడీకి ఈసీ క్లీన్ చిట్
మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని చెప్పింది. నిబంధనలకు లోబడే మిషన్ శక్తి ప్రసంగం ఉందన్న ఈసీ.. అందులో మోడీ ఏ పార్టీ పేరు ప్రస్తావించలేదన్న విషయాన్ని గుర్తుచేసింది.
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
బుధవారం యాంటీ శాటిలైట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్గా మారిందని చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. మోడీ టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాలో ప్రసంగించడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ మోడీ ప్రసంగంలో కోడ్ ఉల్లంఘన గురించి తేల్చేందుకు కమిటీని నియమించింది. ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సభ్యులు మోడీ ఎలాంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టంచేశారు.