వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60లక్షల నకిలీ ఓటర్లు: కాంగ్రెస్ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఈసీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ కోసం రెండు టీమ్స్ ను నియమించిన ఈసీ.. జూన్ 7వ తేదీ లోగా నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నరేలా, భోజ్ పూర్, సియోని-మాల్వా, హోషంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ కార్డుల అవకతవకలపై ఈసీ నియమించిన టీమ్స్ విచారణ జరపనున్నాయి.

EC orders probe after Congress claims 60 lakh fake’ voters in MP

కాగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై పలు ఆరోపణలు చేసింది. 2019ఎన్నికల కోసం బీజేపీ భారీ ఎత్తున నకిలీ ఓటర్ కార్డులను తయారుచేస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో దాదాపు 60లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్టుగా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి సమర్పించింది.

'ఈసీకి మేము ఆధారాలు సమర్పించాం. రాష్ట్రంలో దాదాపు 60లక్షల నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే సాగింది.' అని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆరోపించారు. ఇదే విషయంపై మరో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య తీవ్రంగా మండిపడ్డారు.

'గత 10ఏళ్లలో రాష్ట్ర జనాభా 24శాతం పెరిగితే ఓటర్లు మాత్రం 40 శాతం పెరగడమేంటి?.. ఇదెలా సాధ్యం?.. చాలాచోట్ల మేము పరిశీలించాం. ఒక్క ఓటరు పేరు 26 ఓటర్ లిస్టుల్లో నమోదైంది.' అని ఆరోపించారు.

English summary
Soon after a Congress delegation approached the Election Commission alleging large-scale discrepancies in the voters’ list of Madhya Pradesh, the poll panel on Sunday ordered a probe in the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X