ఈసీ అనూహ్య నిర్ణయం: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నో - ఎందుకంటే..
బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటే దేశంలో ఖాళీగా ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ.. నాలుగు రాష్ట్రాల్లో మాత్రం పోల్స్ నిర్వహణకు నో చెప్పడంచర్చనీయాంశమైంది.
నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక - ఈసీ షెడ్యూల్- అమల్లోకి కోడ్ - జీహెచ్ఎంసీ పోల్స్ పైనా ఫోకస్
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ప్రస్తుతానికి మూడు లోక్ సభ స్థానాలు(బీహార్ లోని వాల్మికి నగర్, తమిళనాడులోని కన్యాకుమారి, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి) ఖాళీగా ఉన్నాయి. దేశం మొత్తం కలిపి 64 అసెంబ్లీ సీట్లలో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. కానీ ఒక లోక్ సభ, 56 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఉప ఎన్నికలు జరుపబోమని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఎన్నికల నిర్వహణ కష్టంతో కూడుకున్న వ్యవహారమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం గమనార్హం. ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాల నుంచి వచ్చిన నివేదికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతానికి మిగతా రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.
పవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల మాసికం - జైలు భయంతోనే జగన్ ఆ పని - బుద్ధి తక్కువై పొత్తు: సీపీఐ నారాయణ
Recommended Video
నవంబర్ 3న తెలంగాణలోని దుబ్బాక సహా ఛత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ లోని 54 సీట్లకు బైపోల్ జరుగుతుందని, నవంబర్ 7న మణిపూర్ లోని రెండు అసెంబ్లీ, బీహార్ లోని ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందని ఈసీ తెలిపింది. షెడ్యూల్ ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియామావళి నేటి నుంచే అమలులోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించకపోవడంపై పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.