గుజరాత్ ఎన్నికలు: రూ.1.67 కోట్ల నగదు, లిక్కర్ సీజ్
ఎన్నికల వేళ గుజరాత్లో ఎన్నికల కమిషన్ అధికారులు రూ. 1.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉంది. దాంతో పాటు రూ.8 కోట్ల విలువ చేసే ఖరీదైన లోహాన్ని,
హైదరాబాద్: ఎన్నికల వేళ గుజరాత్లో ఎన్నికల కమిషన్ అధికారులు రూ. 1.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉంది. దాంతో పాటు రూ.8 కోట్ల విలువ చేసే ఖరీదైన లోహాన్ని, 8.8 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
182 సీట్లు గల గుజరాత్ శానససభకు డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. స్వాధీనం చేసుకున్న నగదులో విదేశీ కరెన్సీతో ఏ రాజకీయ పార్టీకైనా లేదా అభ్యర్థికైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అనేది చెప్పలేమని, అందుకు సాక్ష్యాలు ఏవీ లేవని అధికారులు అంటున్నారు.
నవ్సారీలో స్వాధీనం చేసుకున్న నగదు వ్యక్తి తాను నగదు మార్పిడి ఔట్లెట్ నడుపుతున్నట్లు చెబుకుంటున్నారు. ఆ నగదు వ్యక్తులు మార్పిడి చేసుకున్నది మాత్రమేనని చెబుతున్నాడు.
అయితే, కేసును తదుపరి దర్యాప్తు కోసం ఆదాయం పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు.