వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎన్నికలు: రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకున్న ఈసీ

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసులను ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం రాత్రి ఉపసంహరించుకుంది. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఆయన టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

దీంతో ఈసీ ఆయనకు నోటీసులు పంపించింది. డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 126 పైన సమీక్షించాల్సి ఉన్నందున నోటీసును వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.

నాన్‌సెన్స్: గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై జిగ్నేష్, అందుకే బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!నాన్‌సెన్స్: గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై జిగ్నేష్, అందుకే బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

EC withdraws notice to Rahul Gandhi for giving TV interview during Gujarat polls

ప్రస్తుతం మీడియా వివిధ రూపాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు ప్రచారాన్ని నిలిపివేయాలన్న నిబంధనపై సమీక్షించేందుకు, సవరణలు సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో ఎన్నికల సంఘం, సమాచార, ప్రసార, న్యాయ, ఐటీ శాఖలు, నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులు ఉంటారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటం, వివిధ దశలలో పోలింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా దీనిని సమీక్షించాల్సి ఉందని ఈసీ పేర్కొంది.

English summary
Election Commission of India withdrew the notice issued to Rahul Gandhi for violation of the 48-hour ban on campaigning after latter gave an interview to a TV channel in Gujarat on December 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X