రూ.11.86 కోట్ల ఆస్తుల అటాచ్: ఫరూక్ అబ్దుల్లా, ఇతరులు.. జేకేసీఏ మనీ ల్యాండరింగ్ కేసులో..
జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఫరూక్ అబ్దుల్లా, ఇతరుల రూ.11.86 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు పేర్కొన్నది. దీనికి సంబంధించి ఇదివరకే అబ్దుల్లాకు నోటీసులు జారీచేసింది. మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.
రూ.11.86 కోట్ల ఆస్తుల్లో రెండు స్థిర ఆస్తులు, ఒక కమర్షియల్ ఆస్తి, మూడు ప్లాట్లు ఉన్నాయి. వీటన్నింటి విలువ ఇంత మొత్తంలో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే మార్కెట్ వ్యాల్యూ మాత్రం రూ.60 నుంచి రూ.70 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లాను ఈడీ అధికారులు విచారించారు. చాలా సందర్భాల్లో విచారణ జరిగింది. చివరిసారి అక్టోబర్ మాసంలో శ్రీనగర్లో ఎంక్వైరీ కొనసాగింది. ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేశారు. ఇదీ కీలక పరిమాణంగా మారింది. తదుపరి ఒక్కొక్కరీ పాత్ర గురించి ఎంక్వైరీ చేసి.. అరెస్ట్ చేసే అవకాశం ఉంది.