వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం, కార్తీ, సీఏపై ఈడీ ఈ-చార్జీషీట్, మనీ ల్యాండరింగ్ కేసులో పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ ఈ ఫైల్..

|
Google Oneindia TeluguNews

ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. కోర్టు కేసులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున పాస్‌వర్డ్ కలిగిన ఈ-చార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో మాజీకేంద్రమంత్రి చిదంబరం, అతని కుమారుడు కార్తీ, కార్తీ సీఏ ఎస్ఎస్ భాస్కరన్ తదితరుల పేర్లను నమోదు చేశారు.

ఆర్బీఐ గవర్నర్ కేంద్రంతో నిర్మొహమాటంగా ఆ మాట చెప్పాలి... చిదంబరం కీలక వ్యాఖ్యలుఆర్బీఐ గవర్నర్ కేంద్రంతో నిర్మొహమాటంగా ఆ మాట చెప్పాలి... చిదంబరం కీలక వ్యాఖ్యలు

వైరస్ తీవ్రత తగ్గాక.. సాధారణ చార్జీషీట్ దాఖలు చేయాలని ఈడీనీ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ ఆదేశించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో ఫారిన్ ఇన్వెస్టెమెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ 2007లో రూ.305 కోట్లు జమయ్యాయి. ఈ నగదు అక్రమంగా లావాదేవీ అని, అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ప్రోద్బలంతోనే జరిగిందని సీబీఐ అంటోంది. దీనిపై 2017 మే 15వ తేదీన కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.

ED Chargesheet filed against Chidambaram, son Karti in INX Media case

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గతేడాది ఆగస్ట్ 21వ తేదీన చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన కేసులో ఈడీ అక్టోబర్ 16వ తేదీన అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో చిదంబరానికి అక్టోబర్ 22వ తేదీన బెయిల్ రాగా... డిసెంబర్ 4వ తేదీన ఈడీ ఫైల్ కేసిన కేసులో బెయిల్ వచ్చింది. అప్పటినుంచి చిదంబరం బయటే ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఈ పైలింగ్ ద్వారా చార్జీషీట్ ఫైల్ చేసింది.

English summary
Enforcement Directorate has filed a chargesheet against senior Congress leader and former Union minister P Chidambaram in the INX Media money-laundering case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X