రాబర్ట్ వాద్రాకు ఉచ్చు బిగిస్తున్నఈడీ, బికనీర్ భూ స్కామేనా?
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన ముగ్గురు సహయకుల ఇళ్ళలపై బుదవారం నాడు పలు ఈడీ దాడులు నిర్వహించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన ముగ్గురు సహయకుల ఇళ్ళలపై బుదవారం నాడు పలు ఈడీ దాడులు నిర్వహించింది.
బికనీర్ భూమి స్కామ్ కు సంబంధించి రాబర్జ్ వాద్రా కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. బికనీర్ భూ కుంభకోనానికి సంబంధించి సుమారు 1.18 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఈ భూ కుంభకోణానికి సంబంధించి కోల్ కత్తా, రాజస్థాన్ లలో చోటు చేసుకొన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబందించి ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో స్థిర, చర ఆస్తులున్నాయి. ప్రైవేట్ వ్యక్తులనుండి ఈడీ వీటిని స్వాధీనం చేసుకొంది.
మరో వైపు ఈడీ అధికారులు మహేష్ నగర్ కు చెందిన సహయకుడు ఇంట్లో దాడులు నిర్వహించారు. బికనీర్ భూమి కుంభకోణానికి సంబంధించి ఈ సోదాలు నిర్వహించారు.2016 లోనే ఈడీ రాబర్ట్ వాద్రాతో పాటు ఆయన అత్యంత సన్నిహితుడికి ఈడీ నోటీసులు జారీ చేసింది.