వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేకేఆర్ షేర్ల విక్రయం: షారుఖ్‌కు ఈడీ సమన్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టును బాలీవుడ్ నటి జూహి చావ్లా, ఆమె భర్త జయ్ మెహతాతో కలిసి షారుఖ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ జట్టుకు సంబంధించిన కొన్ని షేర్లను 2008లో షారుక్ ఖాన్ మారిషస్‌కు చెందిన ఓ సంస్ధకు విక్రయించాడు. ఈ షేర్ల విక్రయం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మే, 2015న ఈడీ షారుఖ్‌కు సమన్లు జారీ చేసింది.

ED summons Shah Rukh Khan over sale of KKR shares

తాజాగా సోమవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షారుఖ్ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది. అయితే తాను ముంబైలో లేనని షారుఖ్ ఈడీకి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా అతడు ఈడీని కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

English summary
The Enforcement directorate has again issued summons to Kolkata Knight Riders co-owner Shah Rukh Khan for allegedly violating Foreign Exchange Management Act (FEMA) norms, Times Now reported on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X