వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ శుభాకాంక్షలు: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ సందేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం దేశ వ్యాప్తంగా రంజాన్‌ పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Eid 2018: President Kovind, PM Modi extend greetings to nation

'ఈద్‌ ముబారక్‌, ఈ పండుగ రోజున మన సమాజంలోని ఐక్యత, సామరస్యం మరింత పెంపొందాలని ఆశిస్తున్నా' అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. అంతేగాకుండా దేశ ప్రజలకు రమజాన్‌ శుభాకాంక్షలు చెబుతూ.. ఆడియో ఫైల్‌ను షేర్‌ చేశారు.

కాగా, 'ఈద్‌ ముబారక్‌. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను' అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ట్వీట్‌ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రజలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్‌ ముబారక్‌, భగవంతుడు మనందరికి శాంతి, సంతోషం, జ్ఞానం, మంచి ఆరోగ్యం కలిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

English summary
Eid Ul Fitr is being celebrated with pomp and fervour across the country. President Ram Nath Kovind and Prime Minister Narendra Modi greeted the nation on the occasion of Eid-ul-Fitr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X