భర్తను కట్టేసి 8 నెలల గర్భిణి మీద 8 మంది కామాంధులు గ్యాంగ్ రేప్
ముంబై: 8 నెలల గర్భిణి మహిళ మీద 8 మంది కామాంధులు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా తుర్చి ఫాటా ప్రాంతంలో జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి గర్భిణి మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టాస్కావ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు హోటల్ లో పని చెయ్యడానికి కార్మికుల కోసం గాలిస్తున్నారు. ముకుంద మానె అనే వ్యక్తి దంపతులను సంప్రధించాడు, తుర్చి ఫాటా ప్రాంతానికి రూ. 20 వేలు అడ్వాన్స్ తీసుకుని వస్తే హోటల్ లో పని చెయ్యడానికి కార్మికులను పంపిస్తానని చెప్పాడు.
దంపతులు ఇద్దరూ కారులో తుర్చి ఫాటా ప్రాంతానికి వెళ్లారు. ఆ సందర్బంలో ముకుంద మానె అతని వెంట ఉన్న వారు పైపులు కర్రలు తీసుకుని దంపతుల మీద దాడి చేశారు. హోటల్ యజమానిని చెట్టుకు కట్టేశారు. గర్భిణి మహిళను కారులో నుంచి బయటకు లాగేశారు.
తాను 8 నెలల గర్భిణి అని తనను ఏమీ చెయ్యకూడదని మహిళ వేడుకునింది. అయితే కామాంధులు మహిళ మీద సామూహిక అత్యాచారం చేశారు. ఆమె శరీరం మీద ఉన్న నగలు లాక్కొని మీరు పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించిన కామాంధులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.
బాధితులు తాస్కావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముకుంద మానె, సాగర్, జావెద్ ఖాన్, వినోద్ తదితరులు తన మీద అత్యాచారం చేశారని గర్భిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర మహిళా కమిషన్ నివేదిక ఇవ్వాలని సాంగ్లీ జిల్లా పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.