ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?
చెన్నై : ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆషామాషీ కాదు. నామినేషన్ మొదలు ప్రచార సామాగ్రి, ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఒక్కసారి పోటీ చేసి ఓడిపోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంటుంది. అలాంటిది ఓ పెద్దాయన 200వ సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంతకు ఆయన కోటీశ్వరుడు కాదు.. సాదాసీదా మనిషే. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది కదా. ఎన్నికల్లో పోటీచేయడం ఆయన ఈస్టైల్ అన్నమాట.
62 ఏళ్ల ప్రాయంలో మరోసారి..
గెలుపోటములు ఆయనకు లెక్క లేదు. ఎన్నికలు వచ్చాయా, పోటీ చేశామా అన్నదే ఆయన పాయింట్. తమిళనాడులోని సేలం జిల్లా కుంజాండియార్ ప్రాంతానికి చెందిన కె. పద్మరాజన్ స్థానికంగా టైర్ల వ్యాపారం చేస్తుంటారు. తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు లభించాలన్నది ఆయన అంతరంగం. అందుకే ఎన్నికలను టార్గెట్ గా చేసుకున్నారు. ఎలక్షన్లు వస్తే చాలు పోటీచేయడం పనిగా పెట్టుకున్నారు. 62 ఏళ్ల వయసున్న పద్మరాజన్ ఇప్పటికే 199 సార్లు ఎన్నికల బరిలోకి దిగారట. ఈసారి పోటీచేసి 200వ రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నారట.
ఓడిపోవుడే.. అయినా మళ్లీ ప్రయత్నం
ఎలక్షన్లు రావడం, నామినేషన్ వేయడం, పోటీ చేయడం, ఓడిపోవడం.. ఇదంతా ఆయనకు కామన్ గా మారింది. ఇన్నిసార్లు పోటీచేసినా.. గెలుపైతే దక్కలేదు గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు మాత్రం లభించింది. 1986 నుంచి మొదలైన పద్మరాజన్ పోటీ ప్రస్థానం అలా అలా కొనసాగుతూ వస్తోంది. పోటీచేసిన ప్రతిసారి ఓడిపోవడం, డిపాజిట్ దక్కకపోవడం లాంటి విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోరు.
2011లో
తమిళనాడులోని
మెట్టూరు
అసెంబ్లీ
స్థానానికి
పోటీచేయగా
అత్యధికంగా
6వేల
పైచిలుకు
ఓట్లు
పోల్
కావడం
విశేషం.
ఒక
తమిళనాడే
కాదు
ఏపీ,
కేరళ,
ఢిల్లీ,
కర్ణాటక
రాష్ట్రాల్లో
జరిగిన
ఎన్నికల్లోనూ
పద్మరాజన్
పోటీ
చేసిన
సందర్భాలున్నాయి.
ఈసారి
కూడా
ఎక్కడో
ఒక
చోట
నుంచి
పోటీచేసేందుకు
రంగం
సిద్ధం
చేసుకుంటున్నారు.
మహామహుల మీద పోటీ
1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పోటీచేసినప్పుడు అక్కడినుంచి పద్మరాజన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆయనను కిడ్నాప్ చేయడంతో బాగా పాపులర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో సెగ్మెంట్ నుంచి అటల్ బీహార్ వాజపేయిపై కూడా పద్మరాజన్ పోటీ చేశారు. 2014లో నరేంద్ర మోడీపై పోటీ చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సరైన వివరాలు పొందుపరచలేదనే కారణంతో పద్మరాజన్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.
నలుగురు ప్రధానులు, 11 మంది ముఖ్యమంత్రులపై పోటీ చేసిన రికార్డు పద్మరాజన్ సొంతం. ఎక్కువసార్లు పోటీ చేయడం, అపజయాలు పొందడం ఆయనకు రికార్డులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే లిమ్కాబుక్ రికార్డ్స్ లోకి ఎక్కేశారు.