Viral video:ఏందిరా అయ్యా అది.. ఏనుగులతోనే అలా.. ప్రతాపం చూపిందిగా..
కొందరీ అల్లరి మాములుగా ఉండదు. కానీ అదీ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అవును ఏ జంతువు కూడా మనుషులకు ఊరికేనే హానీ కలిగించదు. వాటి మానాన వాటిని పోనియాలి.. కానీ అలా లేదంటే మాత్రం అంతే సంగతులు. కర్ణాటకలో ఓ అల్లరి గుంపు ఇలానే చేసింది. ఏనుగులు రోడ్డు దాటుతుండగా హారన్ మోగించింది. ఇంకేముంది వాటకి చిర్రెత్తుకు వచ్చింది. వెంటనే వారిపై దాడికి దిగింది. ఓ కారు అద్దాలు ధ్వంసం చేసింది. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
ఓ వీడియోలో ఏనుగుల గుంపు సైలెంట్గా రోడ్డు దాటుతున్నాయి. ఆ రూట్లో వెళుతున్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొందరు మాత్రం కారు హారన్ మోగించారు. వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వాటికి చిర్రెత్తుకు వచ్చింది. వాటి ప్రతాపం చూపించాయి. కర్ణాటక హసనూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొన్ని ఏనుగులు కామ్గా రోడ్డు దాటుతుండగా.. కొందరు ప్రయాణికులు తమ కార్ల హర్న్లు మోగించారు. దీంతో ఆ ఏనుగులు బెదిరిపోయాయి.
ఓ కారు పైకి ఏనుగులు దూసుకొచ్చాయి. ఆ కారు అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు రావడం చూసి అందులోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. నెటిజన్లు వారి ప్రవర్తనపై మండిపడుతున్నారు. వాటి జోలికి ఎందుకు వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటంతట అవీ రోడ్డు దాటుతుండగా ఇలా చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. వాటిని కెలికితే ఇలానే ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.