పుల్వామా టెన్షన్... ముగ్గరు హిజ్బుల్ తీవ్రవాదుల హతం
జమ్ము & కశ్మీర్ పుల్వామా జిల్లాలో మరోసారీ ఉద్రిక్త వాతవారణ నెలకోంది. ముగ్గురు హిజ్బుల్ ముజాహిదిన్ తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.అయితే భద్రతాదళాల ఎన్కౌంటర్లో స్థానిక యువకుడు కూడ మృత్యువుపాలయ్యాడు. స్థానికంగా ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో దక్షిణ కశ్మీర్ లోని పల్వామా జిల్లాలో శనివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
కాగా ఈసంఘటనలో ఆయుధాలతోపాటు ఉగ్రవాద సామగ్రిని తోపాటు ఎనౌకౌంటర్లో మృతి చెందిన ముగ్గరు శవాలను కూడ పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మొబైల్తో పాటు ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పాటు జమ్ములోని పలు ప్రాంతాలో ట్రైన్ సర్వీసులను కూడ రద్దు చేశారు.
కాగా పుల్వామా జిల్లాలో నలబై మంది జవానులు తీవ్రవాదుల ఆత్మహుతిదాడిలో మృత్యువాతపడ్డ తర్వాత పుల్వామ జిల్లాలో తీవ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు తీవ్రంగా దృష్టా సారించాయి. మరోవైపు ఎన్కౌంటర్లపై నేరుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రస్థావించారు. ఆయన కశ్మీర్ అడుగుపెట్టిన ప్రతి రెండుమూడురోజులకోకసారీ తీవ్రవాద ఏరివేత కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.