ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: సీఐ సహా ఆరుగురు పోలీసులు మృతి
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాంకేడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో సీఐ సహా ఆరుగురు పోలీసులు మృతి చెందారు. జిల్లాలోని బాందే పోలీస్ స్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
కూంబింగ్ కోసం పోలీసులు వస్తున్నారనే సమాచారం అందుకుున్న మావోలు మాటు వేసి కాల్పులు జరిపినట్లు సమాచారం. బాందే పరిసర ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య పోరుసాగుతూనే ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నాగాలాండ్లో కూలిన ఆర్మీ విమానం
నాగాలాండ్లోని దిమాపూర్లో చీతా అన్ ఆర్మీ విమానం కూలింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లతో సహా ఒక ఆర్మీ అధికారి సురక్షితంగా బయపడ్డారు. రంగాపహర్ ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన విమానం దిమాపూర్లో కుప్పకూలింది. డిఫెన్స్ పీఆర్ఓ ముసావి ఈ విషయాన్ని తెలిపారు.