రాజస్తాన్ సంక్షోభం : తమాషా బంద్ చేయండి... మోదీపై అశోక్ గెహ్లాట్ ఫైర్...
తమాషాలు బంద్ చేయాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీని హెచ్చరించారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభంపై బీజేపీని నిందిస్తూ వస్తున్న ఆయన.. తాజాగా మరోసారి ఆ పార్టీపై ఫైర్ అయ్యారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఒకవేళ పార్టీ హైకమాండ్ సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను క్షమిస్తే... వారిని తిరిగి పార్టీలోకి స్వాగతిస్తామన్నారు. జైసల్మీర్లో తన మద్దతుదారులైన 100 మంది ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టులో శనివారం(అగస్టు 1) ఆయన మాట్లాడారు.
ఏందీ డ్రామా... గెహ్లాట్ ఫైర్...
'మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రి. దేశ ప్రజలు ఆయనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఆయన ప్రజలను చప్పట్లు కొట్టించారు,ప్లేట్లు మోగించేలా చేశారు... మొత్తానికి ప్రజలను నమ్మించారు.. అదో పెద్ద కథ. కానీ ఇప్పటికైనా రాజస్తాన్లో తమాషాకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు వాళ్లు ఎమ్మెల్యేల బేరసారాలకు దిగుతున్నారు. ఏందీ డ్రామా..' అంటూ గెహ్లాట్ ఫైర్ అయ్యారు.మెజారిటీపై తాను నమ్మకంగా ఉన్నానని... అది 21 రోజుల తర్వాతైనా,31 రోజుల తర్వాతైనా... ఎప్పుడైనా సరే ప్రభుత్వ బలాన్ని నిరూపించేందుకు సిద్దమని గెహ్లాట్ పేర్కొన్నారు.
ప్రకంపనలు సృష్టిస్తున్న సచిన్ క్యాంప్...
మరోవైపు సచిన్ పైలట్ మాట్లాడుతూ... తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని,ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ఈ నంబర్ చాలని పేర్కొన్నారు. గెహ్లాట్ క్యాంపుకు చెందిన 10-15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని నాలుగు రోజుల క్రితం పైలట్ ప్రకంపనలు సృష్టించారు. రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన హేమరాం చౌదరి మాట్లాడుతూ... ఒకవేళ అశోక్ గెహ్లాట్ తన ఎమ్మెల్యేలను నియంత్రించడం మానేస్తే.. అప్పుడు నిజంగా ఆయనవైపు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. ఒక్కసారి వాళ్లను స్వేచ్చగా విడిచిపెడితే ఆయన బలమేంటో తెలుస్తుందన్నారు.
Recommended Video
రిసార్టులో ఎమ్మెల్యేలు...
అగస్టు
14న
అసెంబ్లీ
సమావేశాలకు
ఎట్టకేలకు
గవర్నర్
ఆమోదం
తెలిపిన
నేపథ్యంలో
ఎమ్మెల్యేలు
బీజేపీ
గాలానికి
చిక్కకుండా
ఉండేందుకు
గెహ్లాట్
అన్ని
చర్యలు
తీసుకుంటున్నారు.
ఆయన
ప్రభుత్వం
ప్రస్తుతం
స్వల్ప
మెజారిటీని
మాత్రమే
కలిగి
ఉంది.
200
మంది
శాసనసభ్యులున్న
రాజస్తాన్
అసెంబ్లీలో
ప్రస్తుతం
గెహ్లాట్కు
101
మంది
ఎమ్మెల్యేల
బలం
ఉంది.
వీళ్లలో
ఒకరిద్దరు
పార్టీ
ఫిరాయించిన
ప్రభుత్వం
కూలిపోతుంది.
కాబట్టి
ముందు
జాగ్రత్తగా
వాళ్లందరినీ
రిసార్టుకు
తరలించారు.