నిలిచిన రైలు: ముందుకు నెట్టి ఇంజన్ స్టార్ట్ చేశారు
గ్వాలియర్: వేగంగా వెళుతున్న రైలు ఒక్క సారిగా నిలిచిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అయితే ప్రయాణికులు రైల్వే అధికారులు, సిబ్బంది కోసం ఎదురు చూడలేదు, రైలును ముందుకు నెట్టి ఇంజన్ స్టార్ట్ చేయించి మరి గమ్యస్థానం చేరుకున్నారు.
కార్లు, వాహనాలు నిలిచిపోతే ముందుకు, వెనక్కు నెట్టి ఇంజన్ స్టార్ట్ చేయించిన సంఘటనలు మనం చాలనే చూశాం. అయితే రైలును ఆ విధంగా స్టార్ట్ చేయించిన సంఘటన శుక్రవారం మద్య ప్రదేశ్ లో జరిగింది.
శుక్రవారం కైలార్-సబల్ ఘర్స్ మద్య రైలు బయలుదేరింది. రైలు లోని అన్ని బోగీలలో ప్రయాణికులు ఉన్నారు. గ్వాలియర్ లోని రాందాన్ ప్రాంతంలోని ఘాటి దగ్గర లోకోమాటో రైలు ఇంజన్ ఒక్క సారిగా నిలిచిపోయింది. సుమారు ఒక గంట పాటు రైలు కదలలేదు.
విసిగిపోయిన ప్రయాణికులు దాదాపు అందరూ కిందకు దిగారు. తరువాత రైలును ముందుకు నెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు విషయం గుర్తించి ముక్కున చేయి అందించారు. చివరికి రైలు కదలడంతో ప్రయాణికులు ఒక గంట ఆలస్యంగా గమ్యం చేరుకున్నారు.