వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫలితాలు రాకముందే విందూ వినోదం..! రేపు ఎన్డీయే నేతలకు అమిత్ షా ట్రీట్...!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఫలితాలు వెలువడే ముందు బీజేపి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) నేతలకు మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన ఎన్డీయే కీలక నేతలకు ఆహ్వానం పంపినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు రెండు రోజుల పాటు సాయంత్రం వేళ విందు పేరుతో ఆయన సమావేశం కానున్నట్టు చెబుతున్నారు. కేంద్ర క్యాబినెట్ భేటీ కూడా అదే రోజు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
ఎన్డీయే 300 సీట్లుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్పోల్స్ నిన్న స్పష్టమైన అంచనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని పీఠం అధిష్టించడం ఖాయమంటూ బీజేపీ చెబుతుండగా... ప్రతిపక్షాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తున్నాయి. లోక్సభలోని మొత్తం 543 స్థానాలకు గానూ ఏప్రిల్ 11 నుంచి ఈ నెల 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
English summary
The National Democratic Alliance (NDA) leaders will be present on Tuesday by BJP Chief Amit Shah's dinner. According to party sources, he has already sent an invitation to NDA leaders.
Story first published: Monday, May 20, 2019, 18:34 [IST]