దేశ నాయకులు మా అమ్మను చూసి నేర్చుకోవాలి: ప్రియాంక గాంధి
యూపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఉన్న విధేయతను చూసి దేశంలోని రాజకీయ నేతలు నేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధి అన్నారు.
'రాయ్ బరేలీ యూపిఏ చైర్ పర్సన్ నామినేషన్ లో పాల్గోన్న ప్రియాంక గాంధి పాల్గోన్నారు, అనంతరం ఆమే పలు వ్యాఖ్యలను ట్విట్టర్ ద్వార పేర్కోన్నారు ఈనేపథ్యంలోనే "రాయ్ బరేలీ ప్రజల పట్ల మా అమ్మ సోనియా గాంధి చూపించిన విదేయత,శ్రద్దలను చూసి ప్రతి నియోజకవర్గంలోని రాజకీయ నాయకుడు నేర్చుకోవాలని అన్నారు. కాగా ప్రజలకు సేవ చేయడం వారి పట్ల అంకితభావంతో ఉండడమే రాజకీయాలకు అసలైన అర్థం అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎవరికి లభించిందో వారంతా ప్రజల పట్ల కృతజ్ఝతాభావంతో ఉండాలని ఆమే పేర్కోన్నారు.
యూపి రాయ్బరేలీ నుండి పోటి చేస్తున్న సోనియా గాంధి నామీనేషన్ లో ప్రియాంక గాంధి తోపాటు రాహుల్ గాంధి, ఆమే ఉన్నారు. కాగా ఇటివల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధి యూపి తూర్పు విభాగానికి ఇంచార్జ్ గా ఉన్నారు ఈ సంధర్భంగా పలు ఎన్నికల సభలో ఆమే పాల్గోంటున్నారు.