గర్ల్ని వేధించి పారిపోతూ బస్సు కింద పడి మృతి
బెంగళూరు: అమ్మాయి వెంటపడిన యువకుడు ప్రయాణికుల దగ్గర దెబ్బలు తిని చివరికి బస్సు చక్రాల కిందపడి దుర్మరణం చెందిన సంఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది. తుమకూరు జిల్లా హిరియూరు పట్టణంలో నివాసం ఉంటున్న సందీప్ కుమార్ (21) మరణించాడు.
ఇతను హిరియూరు పట్టణంలోని జనతా బజార్ లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తుమకూరు నుండి మధుగిరికి వెళుతున్న ప్రయివేటు బస్సు ఎక్కాడు. ఆ బస్సులో తుమకూరులోని వివిధ కాలేజ్ లలో చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు.
ఆ అమ్మాయిలు వారి సొంత ఊర్లకు వెళ్లడానికి ఆ బస్సు ఎక్కారు. కొంత సేపటి తరువాత సందీప్ కుమార్ ఒక అమ్మాయిని వేధించాడని సమాచారం. ఆ సందర్బంలో బస్సులో ఉన్న ప్రయాణికులు సందీప్ కుమార్ ను పట్టుకుని చితకబాదారు.
తరువాత సందీప్ కుమార్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తుమకూరు పట్టణంలోని బాళేకట్టే ప్రాంతంలో సందీప్ కుమార్ బస్సులో నుండి కిందకు దూకాడు. ఆ సందర్బంలో అదే బస్సు వెనుక చక్రాలు అతని మీద దూసుకు వెళ్లడంతో అతను సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.