కిడ్నాప్, హత్య: ఆర్డేజీ మాజీ ఎంపీకి జీవిత ఖైదు
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ పార్లమెంటు సభ్యుడు షాబుద్దీన్, మరో ముగ్గురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2004వ సంవత్సరంలో శివన్ జిల్లాలో ఎత్తుకెళ్లి, హత్య చేసిన కేసులో వీరికి శుక్రవారం కోర్టు జీవిత ఖైదు విధించింది.
బీహార్లోని శివన్ జిల్లాలో 11 ఏళ్ల క్రితం సోదరులను వీరు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హత్య చేసినట్లుగా కోర్టు నిర్ధారించింది. దీంతో వారికి న్యాయస్థానం శిక్ష విధించింది.
అంతకుముందు మంగళవారం నాడు (డిసెంబర్ 9)న కోర్టు షాబుద్దీన్తో పాటు షేక్ అస్లామ్, ఆరిఫ్ హుస్సేన్, రాజ్ కుమార్ షాలను కోర్టు దోషులుగా తేల్చింది. వారిని సెక్షన్ 302 (మర్డర్), 364ఏ(కిడ్నాప్ తదితరాలు), 201 (ఆధారాల ధ్వంసం), 120బి (కుట్ర) కింద కేసు నమోదయింది.
సమాచారం మేరకు చంద్రశేఖర ప్రసాద్ అనే వ్యక్తి ముగ్గురు కుమారులను ఆగస్టు 16, 2004లో గోషాల రోడ్డులోని ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. వారిని ప్రతాప్పుర్ గ్రామానికి తీసుకు వెళ్లారు. అక్కడ వారి పైన యాసిడ్ పోశారు. ఈ ఘటనలో సోదరులు గిరిష్, సతీష్ చనిపోయారు. కానీ మరో కొడుకు రాజీవ్ రౌషన్ తప్పించుకున్నాడు.