ఛత్తీస్గఢ్లో బీజేపీదే గెలుపు, కాంగ్రెస్ వైపు ఓ సర్వే మొగ్గు: ఎవరేం చెప్పారంటే?
నయారాయపూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు గత నెల నవంబర్ నెలలో ముగిశాయి. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన (నేడు) ముగిశాయి. ఎన్నికలు ముగియగానే వివిధ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. 90 స్థానాలు ఉన్న ఛత్తీస్గడ్లో గెలుపు బీజేపీదేనని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే
ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 65 సీట్లు, బీజేపీకి 21 నుంచి 31 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. జేసీసీ, బీఎస్పీలకు 4-8 సీట్లు వస్తాయని తేలింది.
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే
ఛత్తీస్గడ్ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీకి 46 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 35 సీట్లు, బీఎస్పీకి 7 సీట్లు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుస్తారు.
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీకి 42 నుంచి 50, కాంగ్రెస్ పార్టీకి 32 నుంచి 38, జనతా కాంగ్రెస్ పార్టీకి 06-08 వరకు, ఇతరులకు 01-03 సీట్లు వస్తాయని తేలింది.
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్
రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం బీజేపీకి 43 వరకు, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 వరకు, బీఎస్పీకి 3 నుంచి 7 సీట్లు వస్తాయని తేలింది. న్యూస్ ఎక్స్ ప్రకారం బీజేపీకి 42 నుంచి 50 సీట్ల వరకు, కాంగ్రెస్ పార్టీకి 32 నుంచి 38 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వస్తాయని తేలింది.