ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ఫైనల్ కాదు... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
దేశవ్యాప్తంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్పోల్ ఫలితాలు తుది తీర్పు కాదని ఆపార్టీ నేత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే ఫలితాలు తుది తీర్పు కాకపోయినా..బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఫలితాలు కేవలం అధికారంలోకి వస్తుందనే సూచన తప్ప అవి మాత్రం పూర్తి ఫలితాలు కావని అన్నారు.
కాగా గడ్కరీ ప్రధానమంత్రి రేసులో లేనని మరోసారి స్పష్టం చేశారు. ఇక కోత్త ప్రభుత్వం మరోసారి మోడీ నాయకత్వంలోనే ఏర్పాటవుతుందని ఆయన స్పష్టం చేశారు.అయితే ప్రధాని పదవిపై ఇప్పటికే పలుమార్లు స్ఫష్టత ఇచ్చానని వెల్లడించారు.కాగా మోడీ నాయకత్వంలోనే ఎన్నికల బరిలోకి దిగిన నేపథ్యంలోనే తిరిగి మరోసారి ఆయనే ప్రధాని అవుతారని అన్నారు.
బీజేపీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల వల్లే బీజేపీకి ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో అనుకూలంగా వచ్చయని అయన అన్నారు.కాగా మహారాష్ట్ర్రలో గతంలో సాధించిన సీట్లే తిరిగి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాగా పీఎం నరేంద్రమోడీ బయోపిక్ సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు.