వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ : ఈసీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ! -ఈసీ || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు సాయంత్రం ఆరుగంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇస్తామంటూ తెగహడావుడి చేసేసిన మీడియాకు ఎన్నికల సంఘం మరో అరగంట పొడిగిస్తూ సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించొచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిరవహించరాదని 1951 ప్రజాప్రతినిధుల చట్టం కల్పించిన హక్కు ద్వారా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

లోక్‌సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకు జరిగిన నేపథ్యంలో ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఎలాంటి మాధ్యమాల ద్వారా కానీ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టరాదని ఒకవేళ బయటపెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దశల వారీగా జరిగిన ఎన్నికల్లో ఎన్నికలు ముగిసిన 48 గంటల పాటు ఒపీనియన్ పోల్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతరత్ర సర్వేలపై కానీ చర్చించడాన్ని కూడా సీరియస్‌గా పరిగణించింది ఎన్నికల సంఘం.

ల‌గ‌డ‌పాటి అంచ‌నా టీడీపీ న‌మ్మ‌టం లేదా: నేత‌లు ఏమ‌య్యారు : అస‌లు కార‌ణం అదేనా..!ల‌గ‌డ‌పాటి అంచ‌నా టీడీపీ న‌మ్మ‌టం లేదా: నేత‌లు ఏమ‌య్యారు : అస‌లు కార‌ణం అదేనా..!

Exit polls can be declared only after 6:30 pm onwards:EC

ఇక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మే 19న సాయంత్రం ఆరుగంటల సమయానికి పోలింగ్ ముగుస్తుంది. మొత్తం ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్లో నిల్చున్న ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల సంఘం. ఓటే వేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని భావించిన ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్ ఫలితాలను మరో అరగంట వాయిదా వేసి 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువరించొచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

English summary
The Election Commission of India(ECI) has directed media to conduct exit polls from 6:30 pm onwards.ECI, in the exercise of the powers under sub-section(1) of Section 126A of the Representation of the People Act, 1951 has notified that the period between 7:00 AM on April 11 and 6:30 PM on April 19 as the period during which conducting any exit poll is prohibited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X