ఎగ్జిట్ పోల్స్ను నమ్మకండి.. నిరాశలో ఉన్న కార్యకర్తలకు ప్రియాంక ఆడియో సందేశం
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఎన్జీఏకు పట్టం కట్టనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎగ్జిట్ పోల్స్పై తొలిసారి స్పందించి ఆమె.. కార్యకర్తలకు ఆడియో సందేశాన్ని పంపారు. సర్వే ఫలితాలను నమ్మొద్దని ప్రియాంక కోరారు. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కుమారస్వామిలో ఎగ్జిట్ పోల్ వణుకు : యడ్డీ నుంచి ముప్పు ఉంటుందని ఆందోళన
"ఎగ్జిట్ పోల్స్ చూసి మీరు నిరుత్సాహానికి గురై ఉంటారు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దు. కార్యకర్తలందరూ స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ సెంటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిందుకు అందుకు తగ్గ ఫలితాలు కచ్చితంగా వస్తాయని భావిస్తున్నా"నంటూ ప్రియాంక కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశంలో చెప్పారు.
ఆదివారం చివరి విడత పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎన్డీఏ 300లకుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 120 సీట్లకే పరిమితమవుతాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.