వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పేలుడు: ఇజ్రాయిల్ ఎంబసీ, గణతంత్ర ముగింపు వేడుకలకు సమీపంలోనే ఘటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడు ప్రభావం ఏ రకమైనదనేది ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా ఐఈడీ పేలుడుగా భావిస్తున్నారు.

టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ పార్కు చేయబడిన పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో భారీ నష్టం జరగలేదు.

Explosion near Israeli embassy in Delhi; windscreen of several cars damaged

ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌లో ఉన్న ఇజ్రాయిల్ ఎంబసీ ఉంది. ఈ పేలుడుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, గణతంత్ర ముగింపు వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధాని, కేంద్రమంత్రులు, తదితరులు పాల్గొనడం గమనార్హం.

English summary
An explosion has been reported near the Isareli embassy in Delhi. The Delhi Police have reached the site of the explosion. The nature of the explosion is being ascertained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X