ఢిల్లీలో పేలుడు: ఇజ్రాయిల్ ఎంబసీ, గణతంత్ర ముగింపు వేడుకలకు సమీపంలోనే ఘటన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడు ప్రభావం ఏ రకమైనదనేది ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా ఐఈడీ పేలుడుగా భావిస్తున్నారు.
టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలోని ఫుట్పాత్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ పార్కు చేయబడిన పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో భారీ నష్టం జరగలేదు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్లో ఉన్న ఇజ్రాయిల్ ఎంబసీ ఉంది. ఈ పేలుడుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
A low-intensity explosion happened near the Israel Embassy in Delhi, nature of explosion being ascertained. Some broken glasses at spot. No injuries reported; further investigation underway pic.twitter.com/xqIllrCZOQ
— ANI (@ANI) January 29, 2021
కాగా, గణతంత్ర ముగింపు వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధాని, కేంద్రమంత్రులు, తదితరులు పాల్గొనడం గమనార్హం.