షాక్: పదో తరగతి విద్యార్థితో మహిళ వివాహేతర సంబంధం, తల్లి ఆవేదన
ఓ వివాహిత.. పదో తరగతి విద్యార్థితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
పుదుచ్చేరి: ఓ వివాహిత.. పదో తరగతి విద్యార్థితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బాలుడి తల్లి ఫిర్యాదుచేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి అరియాంకుప్పం ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇటీవల పుదుచ్చేరిలోని బాలల సంక్షేమ కమిటీ అధ్యక్షులు విద్యా రామ్కుమార్కు ఓ ఫిర్యాదు చేశారు
తన కుమారుడు పదో తరగతి చదువుతున్నాడని తెలిపింది ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తమ ఇంట్లో అద్దెకు ఉన్న మహిళ (34)తో అతడికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని పేర్కొంది. ఇల్లు ఖాళీ చేయించినా ఆమె తీరు మారలేదని ఆరోపించింది.
ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, అధికారుల విచారణలో సదరు ఆరోపణ నిజమని తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సదరు మహిళపై అరియాంకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది ఇలా ఉండగా, కీలూరులో ఎనిమిదో తరగతి విద్యార్థినిని అదే పాఠశాలలో చదువుకుంటున్న బాలుడు సమీపంలోని చెరకు తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయడానికి యత్నించాడు. ఈ ఘటనపై బాలల సంక్షేమ కమిటీకి సమాచారం అందింది. వారి ఫిర్యాదు మేరకు మంగలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.